హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదు మహిళపై కర్నూలులో గ్యాంగ్ రేప్: ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాదు నగరంలోని రామంతాపూర్‌కు చెందిన మహిళపై సామూహిత అత్యాచారం జరిగింది. రెండు రోజుల క్రితం కర్నూలు వెళ్లిన మహిళను ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమె వద్దనున్న ఫోను, డబ్బులు లాక్కుని పారిపోయారు. దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న బాధితురాలు హైదరాబాద్‌ చేరుకుని ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Hyderabad woman gang raped at Kurnool

బాలుడి అదృశ్యం

నాలుగు రోజుల క్రితం హైదరాబాదులో బాలుడు అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని బోరబండ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బాలుడిని చికిత్స కోసం ఆంధ్రా నుంచి హైదరాబాదు తీసుకొచ్చినట్టు సమాచారం.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బోలేరో వాహనం, బైకు డీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

డీజిల్ ట్యాంకర్ బోల్తా

బయోడీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన సూర్యాపేట జిల్లాలోని చివ్వెల మండలం బీబీ గూడెం దగ్గర చోటు చేసుకుంది. ఈ ఘటనలో ట్యాంకర్‌లో ఉన్న రూ.30లక్షల విలువైన డీజిల్ నేలపాలైంది. స్థానికులు నేలపాలైన డీజిల్‌ను బకెట్లతో తీసుకెళ్తున్నారు.

కోడి పందేల స్థావరంపై దాడి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లిలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలను నిర్వహిస్తున్న 10మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కోడిపుంజులు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు.

English summary
Hyderabad woman gang raped at Kurnool
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X