తెలిసిన వ్యక్తే కాల్పులు జరిపారు, పరువు పోవద్దనే: విక్రమ్, పూరీ పరామర్శ
తనపై కాల్పులు జరిపింది తనకు తెలిసిన వ్యక్తేనని మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. తనను పరామర్శించేందుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికిప్పుడు పే
హైదరాబాద్: తనపై కాల్పులు జరిపింది తనకు తెలిసిన వ్యక్తేనని విక్రమ్ గౌడ్ తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. తనను పరామర్శించేందుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికిప్పుడు పేరు చెబితే తీవ్ర వివాదాలు, తన కుటుంబం పరువు ప్రతిష్ఠల సమస్యలు వస్తాయని అన్నారు.
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్పై కాల్పులు, ఎన్నో అనుమానాలు
అందువల్ల తాను కోలుకున్న తరువాత కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరన్న చెబుతానని ఆయన అన్నట్టు తెలుస్తోంది. కాల్పుల ఘటన సమాచారం అందుకున్న ముకేష్ గౌడ్ ఆస్పత్రికి చేరుకుని తన కుమారుడ్ని చూశారు. వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం విక్రమ్పై దుండగులు కాల్పులు జరపడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
పూరీ పరామర్శ
పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. విక్రమ్ గౌడ్.. త్వరలోనే కోలుకుంటాడని పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ అన్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఆస్పత్రికి వచ్చి విక్రమ్ గౌడ్ను పరామర్శించారు. కాగా, వాస్తవాలు తెలిశాక అన్ని విషయాలు చెబుతామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, తండ్రిని డబ్బులు అడిగారని, ఆయన ఇవ్వనని చెప్పారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో విక్రమ్ ఆత్మహత్యాయత్నం చేశారా? లేక ఎవరైనా కాల్పులు జరిపారా? అనేది సందేహంగా మారింది.