'నేను ముఖ్యమంత్రిని అవుతా, ఎప్పుడనేది చెప్పలేను, కెసిఆర్ పై ఇలా
తాను ముఖ్యమంత్రిని అయ్యేది ఖాయమని , కానీ, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతానో చెప్పలేనని సిఎల్ పి ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర న
నల్గొండ:తాను ముఖ్యమంత్రి అయ్యేది ఖాయనమని, కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతానో చెప్పలేనని సిఎల్ పి ఉపనేత , నల్గొండ ఎంఏల్ఏ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
నల్గొండ జిల్లా కనగల్ లో ఆయన పలు కార్యక్రమాల్లో ఆయన శనివారం నాడు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందన్నారు.
తెలంగాణలో 90 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకొంటామని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ను చూస్తోంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్తుకు వస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ సెంటిమెంట్ తో పబ్బం గడుపుకొంటున్నారని ఆయన కెసిఆర్ పై మండిపడ్డారు.
ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవంటూనే ప్రసార సాధనాల్లో తన గురించి ప్రచారం చేసుకొనేందుకుగాను రూ.940 కోట్లను ఖర్చు చేశారని ఆయన దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తోన్న పాలన తీరును ఎండగట్టేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు.పాదయాత్ర ద్వారానే ప్రజల్లోకి వెళ్ళి కెసిఆర్ మోసాలను ఎండగట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.