గ్యాస్ సబ్సిడీని వదులుకున్న జ్వాలా గుత్తా
దేశంలో దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న ఎంతో మంది నిరుపేదలను పొగబారిన పడి అనారోగ్యంతో మృతి చెందుతున్నారని, అలాంటి వారిని ఆదుకోవడానికి స్ధోమత ఉన్న వారు గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా పిలుపునిచ్చారు.
గ్యాస్ సబ్సిడీని వదులుకున్న జ్వాలా గుత్తా
భారత పెట్రోలియం ఆధ్వర్యంలో భారత్ గ్యాస్ సబ్సిడీని వదులుకోని అర్హులకు అందజేసే కార్యక్రమాన్ని లంగర్ హౌజ్ పెట్రోల్ పంపు వద్ద మంగళవారం నిర్వహించారు.
గ్యాస్ సబ్సిడీని వదులుకున్న జ్వాలా గుత్తా
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్వాలా గుత్తా తన సబ్సిడీని వదులుకుని అర్హురాలైన రేణకకు అందజేశారు.
గ్యాస్ సబ్సిడీని వదులుకున్న జ్వాలా గుత్తా
ఆమెతో పాటు నల్గొండ పావని గ్యాస్ సబ్సిడీని వదులుకొని మంజుల, యాదమ్మలకు అందజేశారు.
గ్యాస్ సబ్సిడీని వదులుకున్న జ్వాలా గుత్తా
ఈ సందర్భంగా జ్వాలా గుత్తా మాట్లాడుతూ దేశంలోని అనేక ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలు, మన్యపు ప్రాంతాల్లోని ప్రజలు కట్టెలపై వంటచేసి పొగబారిన పడి అనేక రోగాలకు గురవుతున్నారని అన్నారు.
గ్యాస్ సబ్సిడీని వదులుకున్న జ్వాలా గుత్తా
దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని వదులుకొని అర్హులకు అందజేసే కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రయోజనాలు కలుగుతాయని ఆమె తెలిపారు.
గ్యాస్ సబ్సిడీని వదులుకున్న జ్వాలా గుత్తా
ఇప్పటి వరకు భారత్ గ్యాస్ సబ్సిడీని తెలంగాణ రాష్ట్రంలో 9800 మంది వదులుకున్నారని, అందులో 20 శాతం హైదరాబాద్ ప్రజలు ఉన్నారని ఎల్పీజీ మార్కెటింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ దేవయాని రోజారాయ్, సీహెచ్ వినోద్, కిశోర్ తెలిపారు.