వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4న వన్ ఇండియా తెలుగు ఎడిటర్ పుస్తకావిష్కరణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ తెలంగాణ రచయిత, వన్ ఇండియా.కామ్(తెలుగు పోర్టల్) ఎడిటర్ కాసుల ప్రతాపరెడ్డి రచించిన ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకావిష్కరణ ఆదివారం(అక్టోబర్ 4న)నాడు జరగనుంది.

హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ హాజరుకానున్నారు. ఆయన చేతులమీదుగానే ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకం ఆవిష్కరణ జరగనుంది.

Kasula Pratap Reddy's book will be released on October 4th

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ తెలుగు సినీా డైరెక్టర్ నరసింగరావు, తెలంగాణ జేఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ రచయిత డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమంలో సంగిశెట్టి శ్రీనివాస్ ప్రధాన ఉపన్యాయం చేయనున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అందర్నీ ఆహ్వానిస్తున్నట్లు ప్రతాపరెడ్డి తెలిపారు. కాగా, 'తెలంగాణ సాహిత్యోద్యమాలు' అనే మరో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు రచయిత ప్రతాపరెడ్డి తెలియజేశారు.

English summary
Well known writer Kasula Pratap Reddy's book will be release on October 4th in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X