తలసానీ.. నోరు అదుపులో పెట్టుకో: నటి కవిత
హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై సినీ నటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె శనివారం మాట్లాడుతూ.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఆయనకు హితవు పలికారు.
కళాకారులకు కులాలు, మతాలు, ప్రాంతాలు లేవని, సినిమాల్లోకి రాజకీయాలను తీసుకురావద్దని సూచించారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి టిఆర్ఎస్లో మంత్రి పదవి పొందిన తలసానికి ఏపి సిఎం చంద్రబాబు పేరెత్తే అర్హత లేదన్నారు. సనత్నగర్ సీటుకోసం చంద్రబాబు కాళ్లావేళ్లా పడిన సంగతిని మర్చిపోవద్దని కవిత అన్నారు.
కాగా, శుక్రవారం జరిగిన మే డే వేడుకల సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. టాలీవుడ్లో పలువురు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నారని, అది మానుకోవాలని అన్నారు.
నైపుణ్యం ఉంటే సినీ పరిశ్రమలో రాణించవచ్చునన్నారు. సినీ పరీశ్రమలో ఉన్న విధానాలు మారుస్తామన్నారు. తెలుగు సినీ నటులు తమను ఇబ్బంది పెట్టకుండా ఉంటే, తాము కూడా బాగా చూసుకుంటామన్నారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదులోనే ఉంటుందన్నారు. ఇక నుండి చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా పని ఉండదన్నారు. కాగా, తలసాని వ్యాఖ్యలను ఉద్దేశించి కవిత పై విధంగా స్పందించారు.