కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిల్లరగాళ్లు, గొర్రెలు: తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గొర్రెలు, అధికార యావ తప్ప ఏమీ లేదని విమర్శించారు.

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గొర్రెలు, అధికార యావ తప్ప ఏమీ లేదని విమర్శించారు.

చిల్లరగాళ్లకు అధికారం తప్ప ప్రజాసంక్షేమం పట్టదన్నారు. ప్రతిపక్ష గొర్రెలు విమర్శలు చేయడం తప్ప ఏదైనా చేసిన ముఖమా, చూసిన ముఖమా అన్నారు.

గొర్రెల పంపిణీపై ప్రతిపక్ష గొర్రెలు విమర్శలు అర్థరహితమన్నారు. 84 లక్షల గొర్రెలను తీసుకువస్తే ఎక్కడైనా 10 గొర్రెలు చనిపోవా అని ప్రశ్నించారు.

KCR controversial comments on opposition

మీ ముఖానికి 84 వందల గొర్రెలనైనా పంపిణీ చేశారా అన్నారు. ఎక్కడో పది గొర్రెలు చనిపోతే ఆ విషయాన్ని తీసుకొని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.

ప్రతిపక్షాల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ అధికారం కోసం ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయే తప్పా ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదన్నారు.

కాగా, కేసీఆర్ మూడో విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎర్రవల్లి గ్రామం నుంచి కరీంనగర్ కేసీఆర్‌కు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అలగనూరు వద్ద స్వాగతం పలికారు. ఎల్‌ఎండీ కట్ట దిగువన సీఎం మహాగని మొక్కను నాటారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao make controversial comments on opposition leaders on Wendesday in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X