బాబు సిల్క్ను ప్రారంభించిన కెసిఆర్: కెటిఆర్ సతీమణి శైలిమ సందడి(ఫొటోలు)
హైదరాబాద్: నగరంలో జేఎస్బాబు సిల్క్స్ వస్త్ర దుకాణానికి చెందిన రెండు శాఖలు గురువారం ప్రారంభమయ్యాయి. సోమాజిగూడలో జేఎస్బాబు సిల్క్స్ వస్త్ర దుకాణాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. కేపీహెచ్బీ సర్వీసు రోడ్డులోని శాఖను చినజీయర్స్వామి ప్రారంభించారు.
సోమాజిగూడ వస్త్ర దుకాణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ చీరలు నేస్తున్న తీరును పరిశీలించారు.
అదే సమయంలో కేసీఆర్ సతీమణి శోభ, కోడలు, మంత్రి కెటి రామారావు సతీమణి శైలిమ చీరలు కొనుగోలు చేశారు. కేపీహెచ్బీ సర్వీసు రోడ్డులోని శాఖ ప్రారంభోత్సవంలో చినజీయర్ స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే వస్త్రాలను అందుబాటులో ఉంచేందుకు దుకాణ యజమాని మర్రి వెంకటరెడ్డి చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. కాగా, మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు దుకాణంలో తొలుతగా వస్త్రాలు కొనుగోలు చేశారు.