వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నాళ్లకెన్నాళ్లకు: కెసిఆర్‌తో కోదండరామ్ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత కోదండరామ్ కెసిఆర్‌ను కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

అయితే, కోదండరామ్ తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికే కెసిఆర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. మే 1వ తేదీన జరిగే తన కుమారుడి పెళ్లికి కోదండరామ్ కెసిఆర్‌ను ఆహ్వానించినట్లు చెబుతున్నారు.

Kodandaram meets KCR after a long gap

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కోదండరామ్‌కు ముఖ్యమైన స్థానం దక్కుతుందని అందరూ అంచనా వేశారు. అయితే, కెసిఆర్ ఆయనకు ఏమైనా ఇవ్వజూపారో లేదో తెలియదు గానీ ఇరువురి మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో కోదండరామ్ కెసిఅర్‌ను కలవడంపై ఆసక్తి చోటు చేసుకుంది.

ఇదిలావుంటే, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మంగళవారం ఉదయం తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ పట్నాయక్ కన్నుమూసిన విషయం విదితమే.

English summary
Telangana political JAC Kodandaram met Telangana CM K chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X