లేడీ టెక్కీకి లైంగిక వేధింపులు, ఫేస్ బుక్ లో పోస్టు, నిందితుడికి వార్నింగ్
క్యాబ్ కోసం ఎదురుచూస్తోన్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఓ పోకిరి వేధించాడు. ఆమె వెంటే కారులో వెంబడించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే బాధితురాలు నిందితుడి కారును ఫోటో తీసి ఫేస్ బుక్ ద్వారా.
హైదరాబాద్: క్యాబ్ కోసం ఎదురుచూస్తోన్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఓ పోకిరి వేధించాడు. ఆమె వెంటే కారులో వెంబడించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే బాధితురాలు నిందితుడి కారును ఫోటో తీసి ఫేస్ బుక్ ద్వారా షీ టీమ్ కు ఫిర్యాదుచేసింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైద్రాబాద్ రాయదుర్గంలోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ఓ యువతి పనిచేస్తోంది. ఐదు రోజుల క్రితం ఆమె తన విధులను ముగించుకొంది. స్నేహితులు ఆమెను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఆమెను దించేశారు. అక్కడి నుండి సోమాజీగూడలోని తన ఇంటికి వెళ్ళేందుకుగాను ఆమె క్యాబన్ ను బుక్ చేసుకొంది.
అయితే క్యాబ్ కోసం ఆమె ఎదురుచూస్తుండగా బీఎండబ్ల్యూ లో ఓ వ్యక్తి గమనించాడు. ఆ యువతి వద్దకు వచ్చి తాను లిఫ్ట్ ఇస్తానని ఆమెను అడిగారు.ఇంతలో క్యాబ్ రాగానే ఆమె క్యాబ్ లో కూర్చొంది.
క్యాబ్ ను ఆ వ్యక్తి తన బీఎండబ్ల్యూ కారు ద్వారా వెంబడించాడు.సోమాజీగూడలోని ఆ యువతి ఇంటి వరకు అతను ఫాలో అయ్యాడు.ఆమె క్యాబ్ డ్రైవర్ కు డబ్బులు చెల్లించే సమయంలో కూడ అతడు ఆమె పట్ల అసభ్యంగా మాట్లాడాడు.
దీంతో ఆమె తన సెల్ పోన్ ద్వారా అతడి కారును ఫోటో తీసింది. 100 నెంబర్ కు ఫోన్ చేసింది. ఇదే సమయంలో ఆ యువతి నివాసం ఉండే వాచ్ మెన్ ,క్యాబ్ డ్రైవర్ కూడ పోకిరిని బెదిరించాడు.దీంతో అతడు అక్కడి నుండి వెళ్ళిపోయారు.
అయితే ఈ విషయమై బాధితురాలు ఫేస్ బుక్ ద్వారా షీటీమ్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని షీ టీమ్ సభ్యులు నిందితుడిని షీ టీమ్ కార్యాలయానికి తీసుకువచ్చారు. అయితే తానే వేధించినట్టుగా ఆధారాలు ఏమిటని నిందితుడు ఎదురు ప్రశ్నించాడు.
తన పరువుకు భంగం కలిగేటట్టుగా వ్యవహరించారని ఆయన పోలీసులకు చుక్కలు చూపించారు.అయితే నిందితుడి సెల్ ఫోన్ డేటా, సెల్ ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా ఘటన జరిగిన రోజున నిందితుడు బాధితురాలి ఇంటి వద్దే ఉన్నట్టు పోలీసులు ఆధారాలను చూపించారు.
నిందితుడిని గుర్తించాల్సిందిగా షీ టీమ్ బాధితురాలిని కోరింది. బాధితురాలు శనివారం నాడు షీ టీమ్ కార్యాలయానికి వచ్చి నిందితుడిని గుర్తించింది.అయితే ఫిర్యాదు వద్దని గట్టిగా హెచ్చరించి పంపింతే చాలని బాధితురాలు కోరింది. దీంతో నిందితుడిని హెచ్చరించి పంపినట్టు షీ టీమ్ ఏసీపి కవిత చెప్పారు.