సిలిండర్ల ట్రక్కు ఢీకొని ఈడ్చుకెళ్లింది: టెక్కీ దుర్మరణం (పిక్చర్స్)
హైదరాబాద్: ద్విచక్ర వాహనాన్ని ఓ గ్యాస్ సిలిండర్ల ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఓ కాల్ సెంటర్ ట్రెయినీ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సందీప్ కుమార్ (32)కు భార్య, మూడు నెలల బాబు ఉన్నాడు. వీరు అల్వాల్లో ఉంటున్నారు.
సందీప్ కుమార్ బేగంపేటలోని ఓ కాల్ సెంటర్లో ట్రెయినీగా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం అల్వాల్ నుంచి ప్యారడైజ్ మీదుగా బేగంపేటకు వెళ్తున్నాడు. పాత ఆనంద్ థియేటర్ సమీపంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన సిలిండర్ల లారీ సందీప్ కుమార్ బైక్ను ఢీ కొట్టి కొంతదూరం లాక్కుపోయింది.
సందీప్ లారీ కిందపడి దుర్మరణం చెందాడు. రాంగోపాల్పేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ను అదుపులోని తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనాన్ని ఓ గ్యాస్ సిలిండర్ల ట్రక్కు ఢీకొన్న ఘటనలో కాల్ సెంటర్ ట్రెయినీ ఉద్యోగి సందీప్ మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదం
సందీప్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని భార్య లతా మహేశ్వరి కన్నీరుమున్నీరయింది. వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరిద్దరికీ రెండు నెలల క్రితమే ఓ పిల్లాడు పుట్టాడు.
రోడ్డు ప్రమాదం
సందీప్ కుమార్ తల్లిదండ్రులు నాగేంద్ర, సుకన్య. ప్రస్తుతం సందీప్ తల్లిదండ్రులు కాశీకి వెళ్లారు. తనకు రెండు నెలల క్రితం పుట్టిన తనయుడికి విహాన్ అని పేరు పెడతామని సందీప్ అనుకున్నాడు. అంతలోనే కన్నుమూశాడు.
రోడ్డు ప్రమాదం
గ్యాస్ సిలిండర్ ట్రక్కు డ్రైవర్ రాజేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అతని పైన 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.