భార్య మొదటి భర్తకు బెదిరింపులు: రెండో భర్త అరెస్ట్
వరంగల్: జిల్లాలోని ములుగుకు చెందిన ఓ వ్యాపారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన బొక్కా దుర్గాప్రసాద్గా ములుగు పోలీసులు గుర్తించారు.
కాగా, తన భార్యకు.. మొదటి భర్త చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే బెదిరింపులకు పాల్పడినట్లు దుర్గాప్రసాద్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన నాండ్రి మానసకు ఇదే గ్రామానికి చెందిన దొంగరి రామకృష్ణతో వివాహం జరిగింది.
అయితే ఏడాది తిరక్కముందే భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంతో విడాకులు తీసుకున్నారు. కొద్దిరోజులకు హైదరాబాద్కు వెళ్లిన మానస అక్కడే ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ తోటి ఉద్యోగి దుర్గాప్రసాద్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం వారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాపురంపెట్టారు. అయితే మానస తన మొదటి భర్తనుంచి విడిపోయిన పరిస్థితుల్ని దుర్గాప్రసాద్కు చెప్పుకొని కంటతడి పెట్టింది. దీంతో తన భార్యకు అన్యాయం చేసిన వ్యక్తిపై కక్షతీర్చుకోవాలనే ఉద్దేశంతో దుర్గాప్రసాద్.. రామకృష్ణను ఫోన్లో బెదిరింపులకు గురిచేశాడు.
ఈ క్రమంలో దుర్గాప్రసాద్ బెదిరింపులపై రామకృష్ణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుడు దుర్గాప్రసాద్ ను అరెస్ట్ చేశారు.