హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరంలో అందరు చూస్తుండగా కత్తితో పొడిచి హత్య (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ బండి పైన పని చేసే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సికింద్రాబాదులోని కళాసీగూడ బర్దన్ దొడ్డి ప్రాంత నివాసి ఒకరు ఎస్‌డీ రోడ్డులోని స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రాంతంలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.

అతని దగ్గర ఓ వ్యక్తి కొంతకాలంగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో టిఫిన్ బండి వర్కర్.. పక్కనే బస్టాండ్ దగ్గర నిల్చున్నాడు. అంతలో ఆటోలో వచ్చిన కొందరు కత్తితో ఆ వర్కర్ గొంతు కోసి, పారిపోయారు.

టిఫిన్ సెంటర్ యజమాని పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని తండ్రి, సోదరుడిని పోలీసులు విచారిస్తున్నారు. హత్య విషయం తెలియగానే డిసిపి ప్రకాశ్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

పట్టపగలే హత్య

పట్టపగలే హత్య

సంఘటన ప్రాంతంలో ఉన్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు డిసిపి ప్రకాశ్ రెడ్డి. మూడు ప్రత్యేక బృందాలతో దర్యాఫ్తు చేపట్టారు.

పట్టపగలే హత్య

పట్టపగలే హత్య

క్లూస్ టీం, డాగ్ స్క్కాడ్ సంఘటన స్థలానికి చేరుకుంది. మహంకాళీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగప్రవేశం చేశారు.

 పట్టపగలే హత్య

పట్టపగలే హత్య

చాలామంది చూస్తుండగానే పట్టపగలే ఈ దారుణంగా హత్య జరిగింది. ఈ సంఘటన సికింద్రాబాద్ మహంకాళి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

పట్టపగలే హత్య

పట్టపగలే హత్య

ఆటోలో వచ్చిన ఇద్దరు దుండగులు కత్తితో పొడిచి పారిపోయారు. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

పట్టపగలే హత్య

పట్టపగలే హత్య

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

పట్టపగలే హత్య

పట్టపగలే హత్య

నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.

English summary
Man attacked with knife, dead in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X