సికింద్రాబాద్లో దారుణం: ఆటోలో వచ్చి కత్తులతో పొడిచి చంపారు
హైదరాబాద్: సికింద్రాబాద్లో దారుణం చోటుచేసుకుంది. నగర నడిబొడ్డున ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గర నడిరోడ్డుపై ఓ యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆటోలో వచ్చిన కొంత మంది దుండగులు యువకుడిపై కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. తీవ్ర గాయాలు పాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడి భయంకర వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
మృతుని వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం
నగరంలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై అత్యాచారం జరిపి హతమార్చిన సంఘటన లాలాగూడలో సంచలనం సృష్టించింది. 17 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన సంఘటన లాలాగూడ పోలీసుస్టేషను పరిధిలోని శాంతినగర్లో చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.