హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒంటరిగా జీవనం.. ఓ వ్యక్తి దారుణ హత్య(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మతిస్ధిమితం లేని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ముషీరాబాద్ పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం ముషీరాబాద్ స్టేషన్ పరిధి గాంధీనగర్‌లోని నారాయణ ఎన్ క్లేవ్ పాత భవనంలోని మొదటి అంతస్తులో సుశీల్ చక్రవర్తి (42) ఒంటరిగా నివసిస్తున్నాడు.

కుసుమకుమారిని ఆయన 1996లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. 2000వ సంవత్సరం నుంచి చక్రవర్తికి మతి స్ధిమితం లేదు. కుటుంబ కలహాలతో 2012 ఏప్రిల్ నుంచి కుసుమకుమారి పిల్లలతో సహా మౌలాలిలోని తల్లి ఇంటి వద్ద ఉంటున్నారు. అప్పటి నుంచి సుశీల్ ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు.

శనివారం ఆయన ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఆయన చిన్నాన్న తలుపు తీసి చూడగా పడగగదిలో హత్యకు గురికాబడ్డాడు. ఈ విషయాన్ని సుశీల్ చక్రవర్తి భార్య కుసుమకుమారి, ముషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు సంఘటన స్ధలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తలపై పెద్దగాయం, నోట్లో కత్తెర గుచ్చుకొని ఉంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

చక్రవర్తి చిన్నాన్న చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన భర్తకు వివాహేతక సంబంధాలు ఉన్నాయని, ఈ క్రమంలో హత్య జరగి ఉంటుందని భార్య కుసుమకుమారి అనుమానం వ్యక్తం చేశారు.

ఒంటరిగా జీవనం.. ఓ వ్యక్తి దారుణ హత్య

ఒంటరిగా జీవనం.. ఓ వ్యక్తి దారుణ హత్య

మతిస్ధిమితం లేని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ముషీరాబాద్ పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం ముషీరాబాద్ స్టేషన్ పరిధి గాంధీనగర్‌లోని నారాయణ ఎన్ క్లేవ్ పాత భవనంలోని మొదటి అంతస్తులో సుశీల్ చక్రవర్తి (42) ఒంటరిగా నివసిస్తున్నాడు.

ఒంటరిగా జీవనం.. ఓ వ్యక్తి దారుణ హత్య

ఒంటరిగా జీవనం.. ఓ వ్యక్తి దారుణ హత్య

కుసుమకుమారిని ఆయన 1996లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. 2000వ సంవత్సరం నుంచి చక్రవర్తికి మతి స్ధిమితం లేదు. కుటుంబ కలహాలతో 2012 ఏప్రిల్ నుంచి కుసుమకుమారి పిల్లలతో సహా మౌలాలిలోని తల్లి ఇంటి వద్ద ఉంటున్నారు. అప్పటి నుంచి సుశీల్ ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు.

 ఒంటరిగా జీవనం.. ఓ వ్యక్తి దారుణ హత్య

ఒంటరిగా జీవనం.. ఓ వ్యక్తి దారుణ హత్య

చక్రవర్తి చిన్నాన్న చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన భర్తకు వివాహేతక సంబంధాలు ఉన్నాయని, ఈ క్రమంలో హత్య జరగి ఉంటుందని భార్య కుసుమకుమారి అనుమానం వ్యక్తం చేశారు.

 ఒంటరిగా జీవనం.. ఓ వ్యక్తి దారుణ హత్య

ఒంటరిగా జీవనం.. ఓ వ్యక్తి దారుణ హత్య


పోలీసులు సంఘటన స్ధలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తలపై పెద్దగాయం, నోట్లో కత్తెర గుచ్చుకొని ఉంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

English summary
Man dead in his apartment at Hyderabad, Musheerabad Police limits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X