ఉచిత విద్య: అనాథ పిల్లలకు నారా లోకేష్ సాయం(పిక్చర్స్)
హైదరాబాద్: తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులను ఆదుకోవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యుడు, టిడిపి అధినేత చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేశ్ ముందుకొచ్చారు. వారిద్దరినీ గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్కు పిలిపించి మాట్లాడిన లోకేశ్.. వారికి ట్రస్టు ద్వారా ఉచిత విద్య అందించనున్నట్లు ప్రకటించారు.
బద్దుల శిరీష (16), మణి (11) అనే ఈ ఇద్దరు చిన్నారులది నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామం. వీరి తల్లి గతంలోనే చనిపోగా తండ్రి కూడా అనారోగ్యంతో ఇటీవల మరణించడంతో వీరిద్దరూ రోడ్డున పడ్డారు. శిరీష పదో తరగతి వరకు చదువుకోగా.. మణి ఐదో తరగతి పూర్తి చేశాడు. వీరు తప్ప కుటుంబంలో మరెవరూ లేరు.
వీరి దుస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన లోకేష్.. వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న జూనియర్ కళా అందులో శిరీషను చేర్చుకొని ఉచిత వసతి, విద్య ఇస్తామని ఆయన ప్రకటించారు.
మణి ఏడో తరగతికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మోడల్ పాఠశాలలో సీటు ఇచ్చి ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు. దిక్కులేని తమకు లోకేశన్న అండగా నిలిచి దారి చూపారని, ఆయన మేలు జీవితంలో మరవలేమని శిరీష, మణి చెప్పారు.
నారా లోకేష్
తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులను ఆదుకోవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యుడు, టిడిపి అధినేత చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేశ్ ముందుకొచ్చారు.
నారా లోకేష్
వారిద్దరినీ గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్కు పిలిపించి మాట్లాడిన లోకేశ్.. వారికి ట్రస్టు ద్వారా ఉచిత విద్య అందించనున్నట్లు ప్రకటించారు.
నారా లోకేష్
బద్దుల శిరీష (16), మణి (11) అనే ఈ ఇద్దరు చిన్నారులది నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామం. వీరి తల్లి గతంలోనే చనిపోగా తండ్రి కూడా అనారోగ్యంతో ఇటీవల మరణించడంతో వీరిద్దరూ రోడ్డున పడ్డారు.
నారా లోకేష్
శిరీష పదో తరగతి వరకు చదువుకోగా.. మణి ఐదో తరగతి పూర్తి చేశాడు. వీరు తప్ప కుటుంబంలో మరెవరూ లేరు.
నారా లోకేష్
వీరి దుస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన లోకేష్.. వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
నారా లోకేష్
గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న జూనియర్ కళా అందులో శిరీషను చేర్చుకొని ఉచిత వసతి, విద్య ఇస్తామని ఆయన ప్రకటించారు.