'కిరణ్ కుమార్ రెడ్డీ! ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో'
హైదరాబాద్: ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు.
విలేకరులతో..
ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో సీట్ల భర్తీ ప్రక్రియను ఆన్లైన్ చేసిన సందర్భంగా బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఒక్క రూపాయి ఇవ్వనన్నావుగా
తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఆ రోజు నిండు సభలో కిరణ్ రెడ్డి అన్నారని, ఇప్పుడు మేం ప్రతి రంగానికీ నిధులు కేటాయించుకుంటున్నామని, ఇప్పుడు నువ్వు ఎవరితో చెప్పుకొంటావో చెప్పుకో అని నాయిని వ్యాఖ్యానించారు.
మనమే ముందు
తెలంగాణను సాధించుకున్నదే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కార్మిక శాఖ ముందంజలో ఉందన్నారు. ప్రతి విద్యార్ధికీ ఉపాధి లభించాలన్న లక్ష్యంతో ఐటీఐలు విద్యనందిస్తున్నాయన్నారు.
జాబ్ మేళాల విస్తరణ
తెలిపారు. యువతకు ఉద్యోగాలను అందించే లక్ష్యంతో కార్మిక శాఖ నిర్వహిస్తున్న జాబ్ మేళాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 31 జిల్లాల్లో కూడా జాబ్ మేళాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.