కేబీఆర్ ఫైరింగ్ కేసులో కొత్త ట్విస్ట్: మరో క్లూ దొరికింది
హైదరాబాద్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో కొత్త మలుపు! పార్క్ వద్ద కాల్పుల ఘటనలో ఓబులేష్కు ఎలాంటి సంబంధం లేదని, మీడియాలో అతని ఫోటోలు వస్తున్నాయని కానిస్టేబుల్ ఓబులేష్ కుటుంబ సభ్యులు డీజీపీ కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
గురువారం మధ్యాహ్నం ఓబులేసు కుటుంబ సభ్యులు వచ్చి మీడియాలో తప్పుడు ఫోటోలు ప్రసారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుతో ఓబులేష్కుసంబంధం లేదని చెప్పారు. తనకు ఏం తెలియదని చెప్పారని సమాచారం. కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన కేసులో నిందితుడి అరెస్టును పోలీసులు ఇప్పటి వరకు ధ్రవీకరించని విషయం తెలిసిందే. దర్యాఫ్తు కొనసాగుతుందని చెబుతున్నారు.
కాగా, బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ వద్ద కారులోకి ఎక్కిన నిత్యానంద రెడ్డితో పాటు అగంతకుడు ఎక్కి అతనిని బెదిరించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పెనుగాలట, కాల్పులు జరిగాయి. నిత్యానంద సోదరుడు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో అతను పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
దుండగుడు చాలా ఆధారాలను కారులోనే వదిలేశాడు. అవి తాను కిడ్నాప్ కోసం వాడిన ఏకే 47 రైఫిల్, కొత్తగా కొనుకున్న ఒక కొత్త జీన్స్ ప్యాంట్, దాని తాలూకు బిల్లు అక్కడే వదిలాడు. అలాగే పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించారు. దానిని బట్టి ఊహాచిత్రం విడుదల చేశారు. అయితే, పోలీసులు నిందితుడిని ఓబులేష్గా గుర్తించారని, అతనిని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఓబులేష్ కుటుంబ సభ్యులు వచ్చి తమ ఫోటోలు వస్తున్నాయని చెప్పడం గమనార్హం.
మరో క్లూ..!
నిత్యానంద రెడ్డి కాల్పుల్లో మరో క్లూ లభ్యమైంది. కాల్పుల అనంతరం నిందితుడు ఓబులేష్ పరుగెడుతుండగా పక్కనున్న భవంతిలో ఉన్న సీసీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రికార్డైన కెమెరాలో అతని కాళ్లు కనిపించాయి.