రోడ్డు ప్రమాదంలో నైజీరియన్ విద్యార్థి మృతి, భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
హైదరాబాద్: నగరంలోని హయత్నగర్ మండలం బాట సింగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు నైజీరియా విద్యార్ధులు బైక్పై వెళుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేగంగా వెళ్తోన్న లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒక నైజీరియన్ విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు.
నైజీరియన్ విద్యార్థులు నోవా ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారని సెయింట్ మేరీస్ కాలేజీలో పరీక్ష రాసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.
భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
ఆవేశంతో భార్యపై కిరోసిన పోసి నిప్పంటించిన సంఘటన నల్గొండ జిల్లాలోని బోడుప్పల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భార్య భర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంతో సహనం కోల్పోయిన భర్త ఆవేశంతో భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతిచెందింది.
ఈ ఘటనలో భర్తకు కూడా తీవ్రంగా గాయలైనాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. భర్తను కూడా స్థానిక ఆసుపత్రిలో స్ధానికులు చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
వనస్థలిపురం ఎస్సై సస్పెండెడ్
నగరంలోని వనస్థలిపురం ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. వనస్థలిపురం ఎస్సై సైదులుపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.