గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదగా 'వన్ రెస్టారెంట్' (ఫోటోలు)
హైదరాబాద్: అత్యంత ఆధునిక హంగులతో హైదరాబాద్లో మరో హై - ఫై రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కు సమీపాన రిలయన్స్ జూబ్లీ ప్రైడ్ ఐదవ అంతస్ధులో వన్ పేరిట ఈ రెస్టారెంట్ను ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.
ఫ్యామిలీ డైనింగ్తో పాటు సమావేశ మందిరం, కిట్టీ పార్టీ లాంజ్, పార్టీ లాంజ్లు ఇక్కడ అందంగా తీర్చిదిద్దారు. యువతకు కేరాఫ్ చిరునామాగా, ఇంటిల్ల పాదికీ అనువైన ఆహ్లాదకరమైన పుడ్ను అందించాలనే లక్ష్యంతో వన్ రెస్టారెంట్ను ఏర్పాటు చేసినట్లు మేనేజింగ్ డైరెక్టర్లు అబ్దుల్ కరీమ్, డాక్టర్ అజహర్, గీతా సాహు తెలిపారు.
బర్త్డే పార్టీలకు వన్ రెస్టారెంట్ బెస్ట్ ప్లేస్ ఆహ్వానించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఫిట్నెస్ బిల్డర్ కిరణ్ దెంబ్లా, చంద్రబోస్, కోరియోగ్రాఫర్ సుచిత్ర, మంజుల తదితరులతో పాటు పలువురు సినీ నటులు, హైఫై పేజ్ త్రీ మహిళలు పాల్గొని సందడి చేశారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ తాను ఆహార ప్రియుడిని అని, తనకు పసందైన వంటకాలు ఇష్టమని, మంచి ఆహారం కూడా రెస్టారెంట్లను అన్వేషిస్తుంటారని, తనకు కొర్రమీను చేపల పులుసు అంటే మహా ఇష్టమని చెప్పారు.