ప్రాణం తీసిన ఈత సరదా, ఉద్యోగి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ చెక్ డ్యాంలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం పెద్దఅంబర్పేటలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివారాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన ఫయాజ్ (13) తన స్నేహితులతో కలిసి ఆదివారం ఈత కొట్టేందుకు చెక్ డ్యాం వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ చెక్డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని డ్యాంలో నుంచి వెలికితీశారు.
మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగి అనుమానాస్పద మృతి
సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి ఉద్యోగి శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అత్తాపూర్ పిల్లర్ నెంబరు 111 దగ్గర శ్యామ్ మృతదేహం పడి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై గాయాలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.