హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్ప తాగి టీవీ చూడ్డానికి వచ్చిన అమ్మాయిపై రేప్

టీవీ చూసేందుకు వచ్చిన అమ్మాయిపై తప్పతాగిన మత్తులో కళ్లు మూసుకుపోయి ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆ అమ్మాయి ఇలా జరుగుతుందని ఎన్నడూ ఊహించి ఉండదు. టీవీ చూడ్డానికి బాలిక పక్కింటికి వెళ్లింది. తప్పతాగిన మత్తులో కళ్లు మూసుకుపోయి ఆ ఇంటి యజమాని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాదులోని మలక్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని ప్రొఫెసర్స్‌ కాలనీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఎస్సై ఎన్‌.రంజిత్‌కుమార్‌ ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన దేవుడు అలియాస్‌ రాజు(40) మూడేళ్ల క్రితం జీవనోపాధి కోసం భార్య, ఇద్దరు కుమారులతో హైదరాబాద్ వచ్చాడు. అక్బర్‌బాగ్‌ డివిజన్‌ ప్రొఫెసర్స్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌ రెండో అంతస్తులో కిరాయికి దిగాడు. సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Owner sexually assaults girl, came to see TV

ఈ క్రమంలోనే అతను మద్యానికి బానిసయ్యాడు. కర్ణాటకకు చెందిన దంపతులు తమ కుమారుడు(9), కూతురు(7)తో కలిసి మూడేళ్ల క్రితం హైదరాబాదు నగరానికి వచ్చి ఇదే అపార్ట్‌మెంట్‌ కింది భాగంలో అద్దెకు ఉంటున్నారు. రెండో తరగతి చదువుతున్న వీరి కూతురు బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. టీవీ చూసేందుకు రెండో అంతస్తులో ఉన్న రాజు ఇంటికి వెళ్లింది.

కొద్దిసేపటి తరవాత బాలిక అన్నయ్య కూడా టీవీ చూసేందుకు అదే ఇంటికి వెళ్లాడు. తన చెల్లిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న రాజును గమనించాడు. బాలిక అన్నయ్యను చూసి నిందితుడు బాలికను ఇంటికి పంపించేశాడు. తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చారు. బాలుడు ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. గురువారం తెల్లవారుజామున బాలిక దుస్తులు, దుప్పటిపై రక్తపు మరకలు చూసిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
A girl has been raped by a man in Malakpet PS of Hyderabad. He was in drunken state at that time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X