హెచ్చరిక: ఆదివారం బంద్, మిగతా రోజుల్లో ఈ వేళల్లోనే
తమ కమీషన్ పెంచకపోతే ఈ ఏడాది మే 14వ, తేది నుండి ఆదివారం పూట పెట్రోల్ బంకులను మూసివేస్తామని పెట్రోల్ పంప్ డీలర్స్ సంఘం హెచ్చరించింది.
హైదరాబాద్: తమ కమీషన్ పెంచకపోతే ఈ ఏడాది మే 14వ, తేది నుండి ఆదివారం పూట పెట్రోల్ బంకులను మూసివేస్తామని పెట్రోల్ పంప్ డీలర్స్ సంఘం హెచ్చరించింది.
గత ఏడాది నవంబర్ లో కూడ ఇదే తరహలో పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అయితే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదనేది పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ వాదనగా ఉంది.
గత ఏడాది నవంబర్ లోనే తాము చేసిన ఈ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందిస్తామని ప్రకటించిన కేంద్రం ఐదు మాసాలు దాటినా ఇంకా చర్యలు తీసుకోకపోవడం పట్ల అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది మే 14వ, తేది నుండి ఆదివారం నాడు పెట్రోల్ బంకులను మూసివేస్తామని ప్రకటించింది.
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ అమరారం ఈ మేరకు గత ఏడాదిలో కేంద్రం ఇచ్చిన హమీని అమలు చేయని విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నాడు.
అయితే ఈ ఏడాది మే 10వ, తేది నుండి పెట్రోలు, డీజీల్ ను కొనుగోలు చేయబోమని చెప్పారు. నిల్వ ఉన్న స్టాక్ ను మాత్రమే విక్రయిస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాత మే 15వ, తేది తర్వాత ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.