వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై నాయిని ఇలా ఎగిరిపడ్డారు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన హావభావాలను కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రదర్సిస్తూ మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రానికి చెందాల్సిన నిధులు తరలింపు కుట్ర ప్రకారమే జరిగిందని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ఆరోపించారు.

శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలోని నిధులు దొం్గదారిన విజయవాడకు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరలించారని మండిపడ్డారు. తమ వాటా నిధులు తాము పొందేవరకు చంద్రబాబును విడవమన్నారు.

హైదరాబాద్‌లో ఉంటున్నారు...ఇక్కడి నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ సంసారం ఈడ...సోకులు మాత్రం' ఆడనా అంటూ వ్యాఖ్యానించారు. దొరికిందిరా బెల్లం అంటూ తెలంగాణాకు చెందిన రూ.610కోట్ల రూపాయలు విజయవాడకు తరలింపునకు గల కారణాలు ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పోచారం శ్రీనివాస రెడ్డి ఇలా..

పోచారం శ్రీనివాస రెడ్డి ఇలా..

రైతు రుణాల మాఫీపై, రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను వ్యవసా శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు.

నయా పైసా వదలం

నయా పైసా వదలం

నయాపైస కూడా వదలమని నాయిని నర్సింహా రెడ్డి చంద్రబాబును హెచ్చరించారు. సామరస్యంగా తాము ఉంటే డబ్బులు లేక అల్లాడుతున్న ఆంధ్రబాబు భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సిన సొమ్మును ఎవడబ్బసొమ్మని బదలాయించినట్లు అని మంత్రి నాయిని ప్రశ్నించారు.

బాబు ఆదేశాల మేరకే..

బాబు ఆదేశాల మేరకే..

చంధ్రబాబు ఆదేశంమేరకే కార్మికశాఖలో నిధుల గోల్‌మాల్‌ కుట్ర ప్రకారమే జరిగిందని నాయిని ఆరోపించారు. ఆంధ్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆహాంకార పూరితంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో కరెంటు సమస్య ఉంటుందని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పిండు.. అయినా సరే రాష్ట్రం కావాలన్నాం వచ్చిందని ఆయన అన్నారు.

బుడ్డర్‌కాన్లు ఎగురుతున్నారు..

బుడ్డర్‌కాన్లు ఎగురుతున్నారు..

మరో మూడేళ్లలో కరెంటు లేకుండా చేసేందుకు ముఖ్యమంత్ర కేసీఆర్‌ చర్యలు తీసుకుంటుంటే తెలుగుదేశం, కాంగ్రెస్‌ బుడర్‌కాండ్లు ఎగురుతున్నారని నాయిని అన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు, పదేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వమే దీనికి కారణమని మంత్రి ఆరోపించారు

English summary
Telangana home ministry Nayini Narasimha Reddy lashed out at Andhra Pradesh CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X