ఇళ్లను అద్దెకు తీసుకొని వ్యభిచార కార్యకలాపాలు, అమ్మాయిల సరఫరా
హైదరాబాద్: వ్యభిచార గృహాల పైన ఎస్వోటీ పోలీసులు బుధవారం రాత్రి కొరడా ఝులిపించారు. సరూర్ నగర్, చైతన్యపురి, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 14 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు.
మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. వీరంతా తెలుగు రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్రలకు చెందిన వారు.
సరూర్నగర్, చైతన్యపురి, మేడిపల్లి, నేరేడ్మెట్, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలలో ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడ కొంత కాలంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
వారికి మూసారంబాగ్ ఎస్బీఐ కాలనీలో ఉంటున్న ముగ్గురు వ్యక్తులు మహిళలను సరఫరా చేస్తుంటారు. ఈ పద్నాలుగు మంది వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తూ గతంలో పలుసారుల అరెస్టు అయినవారే కావడం గమనార్హం.
సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు ఎస్వోటీ పోలీసులు ఏకకాలంలో నిర్వాహకుల ఇళ్ల పైన దాడి చేసి వారిని అరెస్టు చేశారు. 16 సెల్ఫోన్లు, రూ.ఆరిువేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడు ఇళ్లను సీజ్ చేశారు.
వ్యభిచార గృహాల పైన ఎస్వోటీ పోలీసులు బుధవారం రాత్రి కొరడా ఝులిపించారు. సరూర్ నగర్, చైతన్యపురి, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 14 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు.