వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైటెన్షన్.. హైదరాబాద్ జేఎన్టీయూలో ఉద్రిక్తం: భారీగా పోలీసుల మోహరింపు
ప్రభుత్వ ఉత్తర్వులు తమ కెరీర్ కు నష్టమని ఆరోపిస్తూ జేఎన్టీయూ వీసీ చాంబర్ ఎదుట ప్రైవేటు లెక్చరర్లు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తమ కెరీర్ కు ఆటంకంగా మారాయని ఆరోపిస్తూ హైదరాబాద్ జేఎన్టీయూ ఎదుట ప్రైవేటు లెక్చరర్లు ఆందోళనకు దిగారు. 2010 తర్వాత ఎంటెక్ పూర్తి చేసినవారు టీచింగ్ కు అనర్హులంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రైవేటు లెక్చరర్లు మండిపడుతున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు తమ కెరీర్ కు నష్టమని ఆరోపిస్తూ జేఎన్టీయూ వీసీ చాంబర్ ఎదుట ప్రైవేటు లెక్చరర్లు బైఠాయించారు. ప్రైవేటు లెక్చరర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగుతోంది. ఆందోళన నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వర్సిటీలో భారీ భద్రత బలగాలను మోహరించారు.
Comments
English summary
The high tension was continuing in Hyd JNTU. Private lecturers union was opposing govt orders