హైదరాబాద్: రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు లక్ష్యం ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ పైన ఉంది. అలాగే, ప్రపంచ సూపర్ సిరీస్ పైన ఆమె దృష్టి సారిస్తోంది. ప్రస్తుత లక్ష్యం సూపర్ సిరీస్ టైటిల్ అని, వరుసగా టోర్నీలు గెలుస్తుంటే ర్యాంకు మెరుగవుతుందని, ప్రపంచ నెం.1గా నిలవడమే తన లక్ష్యమని సింధు చెప్పింది.
ఏపీనా, తెలంగాణనా?: నవ్విన సింధు, చెప్పిన గోపీచంద్, సైనాపై ప్రశంసలు
రియో ఒలింపిక్స్లో గ్రూపు దశలోనే నిష్క్రమించిన సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో నాలుగు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదవ స్థానానికి దిగజారింది. రజతం గెల్చుకున్నా సింధు ర్యాంకులో ఎలాంటి పురోగతి రాలేదు. సింధు పదో స్థానంలో కొనసాగుతోంది.
ధ్యానంతో ఆట మెరుగు
ఒలింపిక్స్కు వెళ్లే ముందు బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్లో తాను రెండుమూడుసార్లు ధ్యాన శిక్షణ తీసుకున్నానని, ఇది తన ఆట తీరు మెరుగుపరుచుకునేందుకు ఎంతో తోడ్పడిందని, ఇక నుంచి బ్రహ్మకుమారీస్కు స్తానని పీవీ సింధు అన్నారు.
గురువారం బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఆమెను హైదరాబాదులో సత్కరించారు. ఈ సందర్బంగా సింధు మాట్లాడారు. ఇక్కడకు వచ్చినప్పుడు తనకు కొత్త అనుభూతి కలుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీవీ యాంకర్ సుమ మాట్లాడుతూ.. పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉంటే సింధులాంటి వారు ఎంతోమంది తయారవుతారన్నారు. తానూ ఒకప్పుడు బ్యాడ్మింటన్ ఆడేదానిని అని, సింధుకు పోటీ కాకూడదనే ఉద్దేశ్యంతో వదిలేశానని చమత్కరించారు.