డ్రగ్స్: రేవంత్ రెడ్డిపై నాయిని సంచలనం, బిజెపి నేత ఘాటు కౌంటర్
డ్రగ్ రాకెట్ అంశంపై అధికార టిఆర్ఎస్, విపక్ష టిడిపి, కాంగ్రెస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
హైదరాబాద్: సినీ పరిశ్రమతో పాటు, తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న డ్రగ్ రాకెట్ అంశంపై అధికార టిఆర్ఎస్, విపక్ష టిడిపి, కాంగ్రెస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
డ్రగ్ రాకెట్ వ్యవహారంపై బిజెపి నేత రఘనందన్ రావు, టిడిపి నేత రేవంత్ రెడ్డిలు అధికార పార్టీపై విమర్శలు చేశారు. దీనిపై మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తీవ్రంగా స్పందించారు.
షాకింగ్, బిగ్ షాట్స్ పేరు చెప్పిన నవదీప్: విదేశీ డ్రగ్ మాఫియాతో లింక్, అగ్రహీరోలు, హీరోయిన్లు
రేవంత్ రెడ్డి, రఘునందన్ రావులు పబ్బులకు వెళ్తారేమోనని నాయిని ఎద్దేవా చేశారు. దీనిపై రఘునందన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
విమర్శలు చేస్తే డిఫేమేషన్ అంటూ ప్రభుత్వం, అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రఘునందన్ మండిపడ్డారు. ఈ బెదిరింపులకు లొంగేది లేదన్నారు.
తాను, రేవంత్ పబ్బులకు వెళ్తామన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని రఘునందన్ చెప్పారు. నాయినికి తాను సవాల్ చేస్తున్నానని, వీటిపై తేల్చేందుకు ఏ సెంటర్కు వస్తారో రావాలన్నారు.
తాను రక్ష పరీక్షకు సిద్ధమని చెప్పారు. మరి మీరు (నాయిని), మీ సహచర మంత్రులు కూడా అందుకు సిద్ధమా, ఏ కోర్టుకు వస్తారో రావాలని సవాల్ చేశారు. జీవితంలో తాను అల్కాహాల్ ముట్టలేదన్నారు. దిగజారుడు మాటలు వద్దన్నారు.