అమెరికాలో తెలుగు టెక్కీ హత్యపై కేంద్రమంత్రి రాజ్నాథ్ స్పందన
అమెరికాలోని కాన్సాస్లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం నాడు స్పందించారు.
న్యూఢిల్లీ: అమెరికాలోని కాన్సాస్లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం నాడు స్పందించారు. అమెరికా ప్రభుత్వం అక్కడి మైనార్టీలలో ఆ దేశం పట్ల నమ్మకాన్ని తిరిగి సాధించడానికి ప్రయత్నిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ఇటీవల ఓ బార్లో శ్వేతజాతీయుడు అరుస్తూ వచ్చి కాల్పులు జరిపగా... ఈ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందాడు. అలోక్ రెడ్డికి గాయపడ్డాడు. మా దేశం నుంచి వెళ్లిపోండి అని అరుస్తూ అతను కాల్పులు జరిపాడు.
కాన్సాస్ కాల్పులు: నిందితుడు పచ్చి తాగుబోతు, ట్రంప్ పార్టీ కార్యకర్త కానీ..
ఈ ఘటనపై రాజ్నాథ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో స్పందించారు. అమెరికా ప్రభుత్వం ఈ ఘటన పట్ల తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, శ్రీనివాస్, అలోక్ ఇద్దరూ హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పని చేస్తున్నారు. శ్రీనివాస్ హత్యతో అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.