ఈటెల, హరీశ్ లను జైళ్లో పెట్టి.. చిప్పకూడు తినిపించాలి : రేవంత్
కరీంనగర్ : టీఆర్ఎస్ మంత్రులు ఈటెల, హరీశ్ లను అరెస్టు చేసి జైళ్లో పెట్టాలని డిమాండ్ చేశారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మంత్రులిద్దరిని నీటి దొంగలుగా అభివర్ణించిన రేవంత్.. జైళ్లో పెట్టి ఇద్దరికీ చిప్ప కూడు తినిపించాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
జైళ్లో ఉన్న టీడీపీ నేత విజయరమణరావును పరామర్శించడానికి వెళ్లిన రేవంత్.. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులపై టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ బనాయిస్తోందంటూ విరుచుకుపడ్డారు. మంత్రుల మీద తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద దాదాపు 20మంది రైతులను టీఆర్ఎస్ జైళ్లో పెట్టించిందని, ప్రభుత్వ దమనకాండకు ఇదో నిదర్శనమన్న తరహాలో రేవంత్ తన ఆగ్రహాన్ని వ్యక్తపరచారు. కేసులు పెట్టాల్సింది రైతుల మీద కాదని, కేసులే గనుక పెట్టాల్సి వస్తే.. నీళ్ల దొంగలైన ఈటల, హరీశ్ రావుల మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్.