'తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాలు మసకబారితే టిడిపి ఉండదనుకుంటారా'
స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి సోమవారం నాడు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి సోమవారం నాడు డిమాండ్ చేశారు.
మరోసారి కేసీఆర్పై లగడపాటి, అప్పుడే ఎంపీగా గెలిచానని వ్యాఖ్య..
ఎన్టీఆర్ విగ్రహాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాలు మసకబారితే టిడిపి తెలంగాణలో ఉండదని అనుకోవడం విడ్డూరమన్నారు.
అలాగే విగ్రహాలను శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత స్థానిక సంస్థలదే అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు.
అలాగే శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలని కేంద్రం ఆదేశించిందని , తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు గుర్తింపును ఇచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావేనని గుర్తుంచుకోవాలన్నారు.