ర్యాలీపై చెప్పు, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ భావోద్వేగం: అపశృతి (పిక్చర్స్)
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో చర్లపల్లి జైలు నుండి విడుదలైన రేవంత్ రెడ్డికి ఉస్మానియా విశ్వవిద్యాలయం రెండు రకాల అనుభవాలు ఎదురయ్యాయి. ఓయులో ఆయనకు కొందరు ఘన స్వాగతం పలకగా, మరికొందరి నుండి చేదు అనుభవం ఎదురైంది.
చర్లపల్లి జైలు నుంచి రేవంత్, టీడీపీ శ్రేణులు ర్యాలీగా వస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ సమీపంలో విరుచుకుపడ్డారు. చెప్పును ర్యాలీపైకి విసిరి, రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, రేవంత్ రెడ్డి అర్ధరాత్రి సమయానికి ఎన్టీఆర్ భవన్ చేరుకున్నారు. రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయనకు భావోద్వేగంతో స్వాగతం పలికారు. రేవంత్ తన నివాసంలో పది నిమిషాల పాటు మాత్రమే ఉండి, అనంతరం కొడంగల్కు వెళ్లారు.
ఓయు జేఏసీ
రేవంత్ రెడ్డి స్వాగత ఏర్పాట్లను నిరసిస్తూ ఓయూలో కొందరు విద్యార్థులు చేపట్టిన కార్యక్రమంలో అపశృతి దొర్లింది.
ఓయు జేఏసీ
బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. దిష్టిబొమ్మకు నిప్పంటించేందుకు దానిపై పెట్రోల్ పోస్తుండగా శివనారాయణ అనే విద్యార్థి దుస్తులకు నిప్పంటుకున్నది.
ఓయు జేఏసీ
సమీపంలో ఉన్న విద్యార్థులు, పోలీసులు వెంటనే శివనారాయణ దుస్తులు తొలగించారు.
ఓయు జేఏసీ
స్వల్పంగా గాయపడిన విద్యార్థిని పోలీసులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. శివనారాయణ ఎంఫార్మసీ పూర్తి చేసి, క్యాంపస్లో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నారు.
ఓయు జేఏసీ
రేవంత్ రెడ్డి స్వాగత ఏర్పాట్లను నిరసిస్తూ ఓయూలో కొందరు విద్యార్థులు చేపట్టిన కార్యక్రమంలో అపశృతి దొర్లింది.