వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు కేసు: ఏసీబీ కోర్టుకు రేవంత్, సెబాస్టియన్ గైర్హాజరు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహలు బుధవారం ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు

 Revanth will attend at ACB Court

ఈకేసుపై కోర్టులో హాజరుకావాల్సిందిగా రేవంత్, ఉదయ్‌సింహలకు గతనెలలో ఏసీబీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఎ1 రేవంత్, ఎ3 ఉదయసింహ విచారణకు హాజరు కాగా, ఎ2 సెబాస్టియన్ మాత్రం హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో విచారణ అక్టోబర్ 24కు వాయిదా పడింది. కాగా, సెబాస్టియన్ హాజరుకానందున చార్జీషీటు కాపీలను ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.

ఈకేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని అప్పట్లో ఏసీబీ వర్గాలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.

English summary
TDP MLA Revanth will attend at ACB Court for Vote for cash case trial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X