ఓటుకు నోటు కేసు: ఏసీబీ కోర్టుకు రేవంత్, సెబాస్టియన్ గైర్హాజరు
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, ఉదయ్సింహలు బుధవారం ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు
ఈకేసుపై కోర్టులో హాజరుకావాల్సిందిగా రేవంత్, ఉదయ్సింహలకు గతనెలలో ఏసీబీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఎ1 రేవంత్, ఎ3 ఉదయసింహ విచారణకు హాజరు కాగా, ఎ2 సెబాస్టియన్ మాత్రం హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో విచారణ అక్టోబర్ 24కు వాయిదా పడింది. కాగా, సెబాస్టియన్ హాజరుకానందున చార్జీషీటు కాపీలను ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.
ఈకేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ చార్జ్షీట్ దాఖలు చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రేవంత్రెడ్డిని అప్పట్లో ఏసీబీ వర్గాలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.