వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటల్లో పెళ్లి: రోడ్డు ప్రమాదంలో వరుడితో సహా నలుగురి మృతి

మరికొద్ది గంటల్లో బంధు, మిత్రుల సమక్షంలో పెళ్లి పీటలెక్కాల్సిన ఆ పెళ్లి కొడుకును రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు తనవెంట తీసుకెళ్లింది. అతనితోపాటు మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు.

|
Google Oneindia TeluguNews

సూర్యాపేట: మరికొద్ది గంటల్లో బంధు, మిత్రుల సమక్షంలో పెళ్లి పీటలెక్కాల్సిన ఆ పెళ్లి కొడుకును రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు తనవెంట తీసుకెళ్లింది. అతనితోపాటు మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎంతో సంబరంగా ఉండాల్సిన పెళ్ళి మండటం, నవవధువు, వరుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ పెను విషాద ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని పెట్రోలు బంక్‌ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి ఖమ్మం జిల్లా చర్ల మండలానికి వస్తున్న పెళ్లి వాహనం విశ్రాంతి నిమిత్తం మార్గ మధ్యలో ఆగింది.

groom dead

ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు వెంకట శేషసాయినాథ్‌(21), అతని బంధువు దామోదర్‌రావు(35), అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, స‌త్య‌నారాయ‌ణ‌(70), అఖిల్‌(2)లు ఆస్పత్రికి త‌ర‌లిస్తుండ‌గా మృతిచెందారు.

ఈ ఘటనలో గాయపడిన మరో 10మందిని సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి 11 గంటలకు పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది.

English summary
A groom and four others killed in road accident, which is occurred at Mothe in Suryapet district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X