సదర్ జోష్: చిందేసిన అంజన్, దానం(పిక్చర్స్)
హైదరాబాద్: సదర్ మేళా ఘనంగా మొదలైంది. డప్పు చప్పుళ్లు, డీజేల హోరు, యువకుల డ్యాన్సుల మధ్య దున్నపోతుల ఊరేగింపు, ఆటలు నగరంలో కోలాహలంగా జరిగాయి. యాదవులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో పోటాపోటీగా దున్నపోతులను అందంగా ముస్తాబు చేశారు.
దున్నపోతులకు పూజలు చేసి బ్యాండుమేళాల మధ్య నృత్యాలతో హోరెత్తించారు. శ్రీనగర్ కాలనీలో డివిజన్లో ఎల్లారెడ్డిగూడలో దున్నపోతులను ఆకర్షణీయంగా అలంకరించి ఊరేగించారు. డప్పులు, డీజేలతో వందలాది మంది యాదవులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
ఖైరతాబాద్లో శుక్రవారం రాత్రి సదర్ ఉత్సవాలను మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. అనంతరం ఇరువురు నాయకులు స్పెప్పులేసి అందరినీ ఉత్సాహపర్చారు. ఖైరతాబాద్, సనత్నగర్ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్సవాల్లో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
సదర్ జోష్
సదర్ ఉత్సవ మేళా హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఘనంగా మొదలైంది.
చిందేసిన అంజన్, దానం
డప్పు చప్పుళ్లు, డీజేల హోరు, యువకుల డ్యాన్సుల మధ్య దున్నపోతుల ఊరేగింపు, ఆటలు నగరంలో కోలాహలంగా జరిగాయి.
చిందేసిన అంజన్, దానం
ఖైరతాబాద్లో శుక్రవారం రాత్రి సదర్ ఉత్సవాలను మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు.
సదర్ జోష్
దున్నపోతులకు పూజలు చేసి బ్యాండుమేళాల మధ్య నృత్యాలతో హోరెత్తించారు
సదర్ జోష్
యాదవులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో పోటాపోటీగా దున్నపోతులను అందంగా ముస్తాబు చేశారు.
సదర్ జోష్
డప్పు చప్పుళ్లు, డీజేల హోరు, యువకుల డ్యాన్సుల మధ్య దున్నపోతుల ఊరేగింపు, ఆటలు నగరంలో కోలాహలంగా జరిగాయి.
సదర్ జోష్
దున్నపోతులకు పూజలు చేసి బ్యాండుమేళాల మధ్య నృత్యాలతో హోరెత్తించారు.
ఖైరతాబాద్లో..
యాదవులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో పోటాపోటీగా దున్నపోతులను అందంగా ముస్తాబు చేశారు.
ఖైరతాబాద్లో..
డప్పు చప్పుళ్లు, డీజేల హోరు, యువకుల డ్యాన్సుల మధ్య దున్నపోతుల ఊరేగింపు, ఆటలు నగరంలో కోలాహలంగా జరిగాయి.
ఎల్లారెడ్డిగూడ
దున్నపోతులకు పూజలు చేసి బ్యాండుమేళాల మధ్య నృత్యాలతో హోరెత్తించారు.
సదర్ జోష్
మాదాపూర్లో బొద్దం, మల్లెల, ఎర్రగుడ్ల వంశాలకు చెందిన యాదవ సోదరులు నిర్వహిస్తున్న సదర్ ఉత్సవాలు ఈ ఏడాదితో 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి.
మాదాపూర్లో బొద్దం, మల్లెల, ఎర్రగుడ్ల వంశాలకు చెందిన యాదవ సోదరులు నిర్వహిస్తున్న సదర్ ఉత్సవాలు ఈ ఏడాదితో 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. మెగాహిల్స్లో ఎర్రగుడ్ల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలు కోలాహలంగా సాగాయి.
కాగా, సదర్ ఉత్సవాల సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాయదుర్గంలో జరిగిన ఉత్సవాల్లో దున్నపోతులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి యాదవులు ప్రదర్శించిన విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.