కిరణ్ రెడ్డి షాకింగ్, విభజనపై కోర్టుకు: పిటిషన్ స్వీకరణ, కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామ కృష్ణం రాజు సహా 24 మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామ కృష్ణం రాజు, రాయపాటి సాంబశివ రావు సహా 100 మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. రాజ్యాంగ విరుద్ధంగా బిల్లులు ఆమోదించారని పిటిషనర్ల తరఫు లాయర్ చెప్పారు.
పిటిషన్లను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దీనిపై అఫిడవిట్ దాఖలుచేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లను అన్నింటిని కలిపి ఒకేసారి విచారిస్తామని కోర్టు తెలిపింది.
కాగా, ఏపీ విభజన నేపథ్యంలో సమైక్య ఏపీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో తెరాస ప్రభుత్వం, ఏపీలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా.. రెండున్నరేళ్ల తర్వాత మరోసారి విభజన అంశం ఆసక్తికరంగా తెరపైకి వచ్చింది.