వరంగల్లో చాక్లెట్లు పంచిన జగన్ సోదరి షర్మిల, యువతి సెల్ఫీ(పిక్చర్స్)
వరంగల్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు షర్మిల గురువారం (పరామర్శ యాత్ర నాలుగో రోజు) వరంగల్ జిల్లాలోని ఊకల్ మండలం తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. షర్మిలకు ప్రతిచోట జనాలు ఘన స్వాగతం పలికారు.
ఈ రోజుతో పరామర్శ యాత్ర ముగియనుంది. నాలుగ రోజు షర్మిల ఏడు కుటుంబాలను పరామర్శించారు. ఓ యువతి షర్మిలతో కలిసి సెల్ఫీ తీసుకుంది.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు షర్మిల గురువారం (పరామర్శ యాత్ర నాలుగో రోజు) వరంగల్ జిల్లాలోని ఊకల్ మండలం తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
షర్మిల
వైయస్ రాజశేఖర రెడ్డి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. షర్మిలకు ప్రతిచోట జనాలు ఘన స్వాగతం పలికారు.
షర్మిల
ఈ రోజుతో పరామర్శ యాత్ర ముగియనుంది. నాలుగ రోజు షర్మిల ఏడు కుటుంబాలను పరామర్శించారు. ఓ యువతి షర్మిలతో కలిసి సెల్ఫీ తీసుకుంది.
షర్మిల
వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గురువారం షర్మిల ఏడు కుటుంబాలను పరామర్శించారు.
షర్మిల
కాజీపేటలోని బాలవికాస ఆవరణ నుచి పెద్దమ్మగడ్డ, పోచమమ మైదాన్, దేశాయిపేట, కాశిబుగ్గ, ుర్సు, మరియపురం, ఊకల్ హవేలీల్లో షర్మిల 68 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు.
షర్మిల
వరంగల్ జిల్లాలో శుక్రవారంతో పరామర్శ యాత్ర తొలిదశ ముగుస్తుంది. హన్మకొండ పెద్దమ్మగడ్డకుచెందిన తీగల చిరంజీవి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. చిరంజీవి సోదరుడు అనిల్ ఏడు నెలల కొడుకు మన్విత్ను ఒళ్లోకి తీసుకొని లాలించారు.
షర్మిల
ఆ తర్వాత వరంగల్ పోచం మైదాన్లోని సక్కుబాయి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైయస్ పాదయాత్రలో తాను పాల్గొన్నట్లు సక్కుబాయి తనయుడు భాస్కర్ చెప్పారు.
షర్మిల
అనంతరం కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మనవలు, మనవరాళ్లకు షర్మిల చాక్లెట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఉర్సులో రామసుదర్శన్ కుటుంబాన్ని పరామర్శించారు.
షర్మిల
మరియపురంలో రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేం అండగా ఉంటామని వారి కుటుంబానికి షర్మిల ధైర్యం చెప్పారు.