క్లియర్: శిరీష ఫాంహౌస్ కు వెళ్లలేదు, ఆ లొకేషన్ ఎస్సై క్వార్టర్స్ దే: వెస్ట్ జోన్ డీసీపీ
బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించి ఆమె కుటుంబసభ్యులు పలు అనుమానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించి ఆమె కుటుంబసభ్యులు పలు అనుమానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
చదవండి: అది కచ్చితంగా హత్యే, సంచలన విషయాలు వెల్లడించిన శిరీష బాబాయి
కుకునూర్ పల్లిలోని ఫాంహౌస్ కు శిరీష వెళ్లిందన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన అన్నారు. ఆ రోజు రాత్రి 11.20 గంటలకు రాజీవ్ కారు ఎస్సై ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్ కు మాత్రమే వెళ్లిందని, మళ్లీ 2.05 గంటలకు క్వార్టర్స్ నుంచి తిరిగి బయటకు వచ్చిందని చెప్పారు.
ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. తెల్లవారుజామున 1.48 గంటలకు శిరీష తన భర్త సతీష్ కు షేర్ చేసిన లొకేషన్ ఎస్ఐ క్వార్టర్స్ దేనని, ఈ విషయాన్ని ఎయిర్ సెల్ అధికారులు కూడా ధ్రువీకరించారని చెప్పారు.
అంతేకాకుండా ఆ రోజు ఎస్సై ప్రభాకర్ రెడ్డి, రాజీవ్, శ్రావణ్, శిరీష లకు ఫుడ్ సరఫరా చేసిన హోంగార్డు భిక్షపతిని కూడా తాము విచారించామని, ఈ ఆధారాలన్నీ శిరీష ఎస్సై క్వార్టర్స్ కే తప్ప ఇంకెక్కడికీ వెళ్లలేదని నిర్ధారిస్తున్నాయని ఆయన వివరించారు.