వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లియర్: శిరీష ఫాంహౌస్ కు వెళ్లలేదు, ఆ లొకేషన్ ఎస్సై క్వార్టర్స్ దే: వెస్ట్ జోన్ డీసీపీ

బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించి ఆమె కుటుంబసభ్యులు పలు అనుమానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసుకు సంబంధించి ఆమె కుటుంబసభ్యులు పలు అనుమానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.

చదవండి: అది కచ్చితంగా హత్యే, సంచలన విషయాలు వెల్లడించిన శిరీష బాబాయి

కుకునూర్ పల్లిలోని ఫాంహౌస్ కు శిరీష వెళ్లిందన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన అన్నారు. ఆ రోజు రాత్రి 11.20 గంటలకు రాజీవ్ కారు ఎస్సై ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్ కు మాత్రమే వెళ్లిందని, మళ్లీ 2.05 గంటలకు క్వార్టర్స్ నుంచి తిరిగి బయటకు వచ్చిందని చెప్పారు.

beautician-sirisha

ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. తెల్లవారుజామున 1.48 గంటలకు శిరీష తన భర్త సతీష్ కు షేర్ చేసిన లొకేషన్ ఎస్ఐ క్వార్టర్స్ దేనని, ఈ విషయాన్ని ఎయిర్ సెల్ అధికారులు కూడా ధ్రువీకరించారని చెప్పారు.

అంతేకాకుండా ఆ రోజు ఎస్సై ప్రభాకర్ రెడ్డి, రాజీవ్, శ్రావణ్, శిరీష లకు ఫుడ్ సరఫరా చేసిన హోంగార్డు భిక్షపతిని కూడా తాము విచారించామని, ఈ ఆధారాలన్నీ శిరీష ఎస్సై క్వార్టర్స్ కే తప్ప ఇంకెక్కడికీ వెళ్లలేదని నిర్ధారిస్తున్నాయని ఆయన వివరించారు.

English summary
Hyderabad West Zone DCP Venkateswara Rao given clarity on the issue of accused Rajeev and Sravan took Sirisha to a farm house near Kukunoorpally. While talking with media DCP said that on that night at 11.20 PM Rajeev's car went only to SI quarters only at Kukunoorpally and they returned at 2.05 AM he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X