టైం అడిగితే పొడిచాడు: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఘటన
హైదరాబాద్ :టైం అడిగిన పాపానికి ఓ ప్రయాణికుడిని కత్తితో పొడిచిన ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకొంది. ఈ హఠాత్ పరిణాానికి ప్లాట్ పారం పై ఉన్న ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.
నిజామాబాద్ జిల్లా బోదన్ కు చెందిన మహ్మద్ షరీప్ అనే వ్యక్తి కృష్ణా ఎక్స్ ప్రెస్ లో వరంగల్ వెళ్తున్నాడు.ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకొన్న సమయంలో మహ్మాద్ షరీఫ్ టైం ఎంతైందని ఫ్లాట్ ఫాం వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని అడిగాడు.
తననే టైం అడుగుతావా అంటూ ఆ వ్యక్తి షరీఫ్ పై తన వద్ద ఉన్న కత్తితో పొడిచి వెళ్ళాడు.ఈ ఘటనతో ఫ్లాట్ ఫారంపై ఉన్న ప్రయాణీకులు భయానికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
ప్రయాణీకుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రుడికి చికిత్స అందించారు.టైం అడిగితే కత్తితో పొడవాల్సినంతగా కొోపం రాదు. ఎందుకు ఈ ఘటన జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
షరీఫ్ ను కత్తితో పొడిచిన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపట్టారు పోలీసులు. రైల్వేస్టేషన్ లో ఉన్న సిసి కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.