వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో మరో ఎంపీటీసీ గెలిచిన టిడిపి, టిఆర్ఎస్ మూడో స్థానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరో ఎంపీటీసీ సీటును కైవసం చేసుకుంది. ఓటుకు నోటు కేసు అనంతరం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమని కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు చెబుతున్న విషయం తెలిసిందే.

అయితే, టిడిపి స్థానిక ఎన్నికల్లో ఇటీవల ఎంపీటీసీ, సర్పంచ్‌లు పలుచోట్ల గెలుచుకుంది. తాజాగా భాగ్యనగరంలోని రాజేంద్ర నగర్ మండలంలోను ఎంపీటీసీని గెలిచుకుంది. వట్టినాగులపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వెంకటేష్ 378 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

 TDP wins vattinagulapally MPTC

మరో విషయమేమంటే వట్టినాగులపల్లిలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మూడో స్థానానికి పరిమితమైంది.

రాజీనామా ఆమోదించుకో: వెంకటేష్ గౌడ్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ధైర్యం ఉంటే తన శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామా ఆమోదించుకోవాలని టిడిపి నేతలు సవాల్ చేస్తున్నారు. సనత్‌నగర్ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ కూన వెంకటేశ్ గౌడ్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ... తలసాని రాజీనామా ఆమోదింప చేసుకోవాలన్నారు.

English summary
Telugudesam Party won Vattinagulapally MPTC in by elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X