రోడ్డు ప్రమాదంలో టెక్కీ, ఎమ్మెల్యే బంధువు మృతి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడా శాసనసభ్యుడు భాస్కర రావు బంధువు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే, అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతన్ని పొట్రు సుధీర్ (38)గా గుర్తించారు.
పొట్రు సుధీర్ హైదరాబాదులోని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మిర్యాలగుడా బైపాస్ రోడ్డులోని అగ్రి గోల్డ్ వెంచర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం సుధీర్ను ఢీకొట్టింది.
తీవ్ర గాయాలతో విగతజీవిగా పడి ఉన్న సుధీర్ను శనివారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
హైదరాబాదులోని రాజేంద్రనగర్ సమీపంలో గల గగన్పహాడ్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రబ్బర్ ఫ్యాక్టరీ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది.
స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.