కేరాఫ్ గచ్చిబౌలి: యువతులను టెక్కీలుగా మార్చేస్తున్న మైక్రోసాఫ్ట్
హైదరాబాద్: ఐటీ రంగంలో లింగ సమానత్వం కోసం మైక్రోసాఫ్ట్ కృషి చేస్తోంది. ఇందుకోసం యువతులకు కంప్యూటర్ సైన్స్పై అవగాహన పెంచి వారిని ప్రోత్సహిస్తోంది. అంతేగాక, ఐటీ రంగంలో వారికి ఉద్యోగావకాశాలను కల్పించి ఉన్నతమైన జీవితాన్ని అందించే ఏర్పాట్లు చేసింది.
కేరాఫ్ గచ్చిబౌలి
గచ్చిబౌలిలోని తమ కార్యాలయంలో నాన్ ఇంజినీరింగ్ చేస్తున్న అండర్ గ్రాడ్యూయేట్స్ కోసం ఓ వర్క్ షాప్ నెలకొల్పింది. ఈ వర్క్ షాప్నకు షీడెవలప్ స్టెక్ వర్క్ షాప్ అనే పేరుకూడా పెట్టింది.
లక్ష్యాలు
ఈ వర్క్ షాప్ లక్ష్యం యువతుల కంప్యూటేషన్ ఆలోచనలను పెంచడం, అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం. అంతేగాక, కంప్యూటర్స్, కోడింగ్స్లో మంచి అవగాహనను కల్పించడం.
ఉద్యోగావకాశాలు
ఆ
తర్వాత
వారికి
ఐటీ
రంగంలో
మంచి
ఉద్యోగావకాశాలను
కల్పించడం.
తమ
వర్క్
షాప్లో
నైపుణ్యం
ప్రదర్శించిన
యువతులకు
ఉన్నత
స్థానాల్లోనూ
ఉద్యోగావకాశాలను
కల్పించడం
జరుగుతందని
మైక్రోసాఫ్
ప్రతినిధులు
తెలిపారు.
ఎంతగానో ఉపయోగం
కర్నూలులోని సెయింట్ జోసెఫ్ కాలేజీకి చెందిన బీఎస్సీ(లైఫ్ సైన్స్) విద్యార్థి అష్రాఫే ఈ వర్క్ షాపు గురించి మాట్లాడుతూ.. తనకు లాజికల్ థింకింగ్, టెక్నాలజీపై మంచి అవగాహన ఏర్పడిందని తెలిపింది. తన డేటా కలెక్షన్ కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పింది.