తలసాని సభ్యత్వాన్ని రద్దు చేయండి: రాష్ట్రపతికి టిడిపి నేతల వినతి(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ నేతృత్వంలో పలువురు నాయకులు ఆదివారం బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శాసనసభ్యత్వాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వారు రాష్ట్రపతితికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఎల్. రమణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అందరూ కలిసి రావాలని కోరారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నయా పెత్తందారీ వ్యవస్థను పోషిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, ఇతర పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎల్ రమణతోపాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, మల్లారెడ్డి, సయన్నలు రాష్ట్రపతిని కలిశారు.
ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే సాయన్న
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ నేతృత్వంలో పలువురు నాయకులు ఆదివారం బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.
ఎంపి మల్లారెడ్డి
ఈ సందర్భంగా మంత్రి తలసాని శాసనసభ్యత్వాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వారు రాష్ట్రపతితికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
పెద్దిరెడ్డి
అనంతరం ఎల్. రమణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అందరూ కలిసి రావాలని కోరారు.
టిటిడిపి నేతలు
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నయా పెత్తందారీ వ్యవస్థను పోషిస్తున్నారని ఆయన విమర్శించారు.