హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కారు చోరీ: నలుగురు స్త్రీలను పెళ్లాడిన నిందితుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ వాసుదేవ రావు కారును, 21 లక్షల రూపాయల నగదును దొంగిలించిన కేసులో నిందితుడి గురించి పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వాసుదేవ రావు వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న జి. సాయికుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడు.

సాయికుమార్ నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతను నాలుగో భార్యతో కలిసి ఉంటున్నాడు. అతను ఎనిమిది నెలల క్రితం చౌదరి వద్ద కారు డ్రైవర్‌గా కుదిరాడు. సాయికుమార్ నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందినవాడు.

Theft accused had married four times in Hyderabad

అతను పదేళ్ల క్రితం హైదరాబాదుకు వచ్చాడు. జీడిమెట్లలో నివాసం ఉంటున్నాడు. సాయి కుమార్ యజమానులను నమ్మించి, ఆ తర్వాత మోసం చేయడంలో దిట్ట అని పోలీసులు అంటున్నారు. నమ్మకమైన ఉద్యోగిగా యజమానుల వద్ద పేరు సంపాదించుకుంటాడని, ఆ తర్వాత వారిని మోసం చేసి పారిపోతాడని పోలీసులు అంటున్నారు.

ఎవరి వద్ద కూడా అతను ఏడాదికి మించి పనిచేయలేదని చెబుతున్నారు.ట ప్రతి రెండు, మూడేళ్లకోసారి అతను పెళ్లి చేసుకుంటాడని చెప్పారు. అతని నాలుగో భార్య మంజుల అని తెలుస్తోంది. తాను సాయికుమార్‌ను ఎప్పుడు కూడా అనుమానించలేదని చౌదరి అంటున్నారు.

English summary
A week after the theft of Rs 21 lakh and a car belonging to film distributor Vasudeva Rao Chowdury, the police discovered that driver G. Saikumar, the main accused, had married four women. Police said Saikumar, who started working for Mr Chowdury eight months ago, was staying with his fourth wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X