మెట్రో రైలు స్టేషన్ నిర్మాణంలో అపశ్రుతి (పిక్చర్స్)
హైదరాబాద్: మెట్రో రైలు స్టేషన్ నిర్మాణ పనుల్లో భాగంగా మెట్ల నిర్మాణం చేపడుతుండగా అకస్మాత్తుగా ముగ్గురు కార్మికుల పైన మట్టిదిబ్బలు కూలి ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కొత్తపేటలోని అష్టలక్ష్మీ ఆలయం ముఖద్వారం ముందు స్టేషన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మెట్ల నిర్మాణం కోసం గుంత తీసి స్టీల్తో పిల్లర్లకు అవసరమైన పనులు గురువారం చేపట్టారు. గుంతలో బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కార్మికులు పని చేస్తున్నారు.
జయకుమార్ (34), కమలేష్ (25), వినయ్ (30)పై మట్టి, రాళ్లు కూలడంతో అందులో కూరుకుపోయారు. అక్కడ ఉన్న సిబ్బంది, కార్మికులు అప్రమత్తమై వారిని బయటకు తీసి ముగ్గురిని ఆశుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. జయకుమార్, కమలేష్ కాళ్లు విరిగాయి. వినయ్ తలకు గాయమైంది.
కమలేష్
మెట్రో రైలు స్టేషన్ నిర్మాణ పనుల్లో భాగంగా మెట్ల నిర్మాణం చేపడుతుండగా అకస్మాత్తుగా ముగ్గురు కార్మికుల పైన మట్టిదిబ్బలు కూలాయి. ఈ ఘటనలో గాయపడ్డ కమలేష్.
జయకుమార్
మెట్రో రైలు స్టేషన్ నిర్మాణ పనుల్లో భాగంగా మెట్ల నిర్మాణం చేపడుతుండగా అకస్మాత్తుగా ముగ్గురు కార్మికుల పైన మట్టిదిబ్బలు కూలాయి. ఈ ఘటనలో గాయపడ్డ జయకుమార్.
వినయ్
మెట్రో రైలు స్టేషన్ నిర్మాణ పనుల్లో భాగంగా మెట్ల నిర్మాణం చేపడుతుండగా అకస్మాత్తుగా ముగ్గురు కార్మికుల పైన మట్టిదిబ్బలు కూలాయి. ఈ ఘటనలో గాయపడ్డ వినయ్
వినయ్
మెట్రో రైలు స్టేషన్ నిర్మాణ పనుల్లో భాగంగా మెట్ల నిర్మాణం చేపడుతుండగా అకస్మాత్తుగా ముగ్గురు కార్మికుల పైన మట్టిదిబ్బలు కూలాయి. ఈ ఘటనలో గాయపడ్డ వినయ్