నవ్వులు పూయించారు: లోకసభలో తెలంగాణ ఎంపీ, కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ఓ పార్లమెంటుసభ్యుడికి, కేంద్రమంత్రికి జరిగిన సంభాషన గురువారం జరిగిన లోకసభలో నవ్వులు పూయించాయి. ఆ వివరాల్లోకి వెళితే.. లోక్సభలో ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో నవ్వులు పూశాయి. దేశంలో నెలకొన్న నీటి సమస్యపై వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం ఇచ్చారు.
ఆ సమయంలో తెలంగాణ ఎంపీ ఒకరు మిషన్ భగీరథకు అదనపు నిధులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. ఆ ఎంపీ మాట్లాడుతున్న సమయంలో కేంద్ర మంత్రి కొంత అస్వస్థతగా కనిపించారు.
దీంతో 'మంత్రి గారు ఇవాళ చాలా డల్గా ఉన్నారు' అంటూ ఆ ఎంపీ ఛమత్కారంగా అన్నారు. ఆ ఎంపీ చేసిన వ్యాక్యలకు మంత్రి వెంటనే స్పందించారు. ఎవరైనా డబ్బులు అడిగితే, తాను డల్గా మారుతానని మంత్రి సమాధానం ఇచ్చారు. దీంతో సభలో నవ్వులు చిగురించాయి.
ఆ తర్వాత మిషన్ భాగీరతకు కావాల్సిన అదనపు నిధుల విషయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తుందని తెలిపారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిసన్ భాగీరథ పథకాన్ని ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.