వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్ సభ ఖర్చుల కోసం ‘గులాబీ కూలీ’లుగా మారిన కేకే, తలసాని!

వరంగల్ టీఆర్ఎస్ సభ ఖర్చుల కోసం మంగళవారం ఏంపీ కేశవరావు, మంత్రి తలసాని చెమటోడ్చారు. ఇద్దరూ కలిసి ‘గులాబీ కూలీ’ కార్యక్రమం ద్వారా రూ.8 లక్షలు సంపాదించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులకు 'గులాబీ కూలీ' ద్వారా బాగానే గిట్టుబాటు అవుతోంది. మంగళవారం పార్టీ సీనియర్ నేత, ఎంపీ కే.కేశవరావు(కేకే) 'గులాబీ కూలీ'గా మారారు. సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యార్థులకు పాఠాలు బోధించి ఆయన రూ.2 లక్షలు సంపాదించారు.

అలాగే నోవా ఇంజనీరింగ్ కళాశాలలో బోధనా మెలకువలు చెప్పడం ద్వారా మరో రూ.2 లక్షలు సంపాదించారు. దీంతో పాటు, ఒహ్రిస్ హోటల్ లో తెలంగాణ బ్రాండ్ ఐస్ క్రీమ్ ను విక్రయించి ఇంకో రూ.2 లక్షలు సంపాదించారు. మొత్తంమీద 'గులాబీ కూలీ'గా కేశవరావు రూ.6 లక్షలు సంపాదించారు.

kk-talasani

మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో 'గులాబీ కూలీ'గా పని చేసి రూ.2 లక్షల 16 వేలు సంపాదించారు.

ఈ నెల 27న వరంగల్ లో టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఖర్చుల నిమిత్తం పార్టీకి చెందిన పలువురు నేతలు, నాయకులు 'గులాబీ కూలీ'లుగా మారుతున్నారు.

English summary
TRS MP and party Secretary General Dr K Keshava Rao participated in manual work on Tuesday as part of the party's "Gulabi Coolie Dinalu" initiative to raise money for the party's public meeting in Warangal through physical labour. He earned Rs. 6 lakhs through his work. On the other part Minister Talasani Srinivas Rao also participated in manual work in Jalavihar at Necklece Road today and earned Rs.2.16 Lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X