వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'తెలంగాణ' నన్ను వేధిస్తోంది, ఏపీ పట్టించుకోవట్లేదు: మత్తయ్య
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని జెరూసలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇతను సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో నిందితుడు. ఆయన సోమవారం నాడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని జెరూసలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇతను సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో నిందితుడు. ఆయన సోమవారం నాడు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ఈ కేసులో రక్షించాల్సిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెండు ప్రభుత్వాలు రాజీకి వచ్చినా తనను బలిపశువు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పిటిషన్ వేయడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.
ఈ కేసులో స్టీఫెన్ సన్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. మత్తయ్యను రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
Comments
jerusalem mathaiah kcr revanth reddy cash for vote chandrababu naidu telangana జెరూసలేం మత్తయ్య కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు చంద్రబాబు నాయుడు తెలంగాణ
English summary
Telangana government is harassing me, says Jerusalem Mathaiah.
Story first published: Monday, January 16, 2017, 16:03 [IST]