విషాదం: పసివాడి ప్రాణం తీసిన టీవీ
హైదరాబాద్: నగరంలోని బోడుప్పల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో టీవీ చూస్తున్న ఓ బాలుడు, హఠాత్తుగా ఆ టీవీ పేలిపోవడంతో మృతి చెందాడు. హైఓల్టేజీతో విద్యుత్ రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఊహించని ప్రమాదంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు మరణించడంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి
మహబూబ్నగర్: గుర్తు తెలియని వాహనం డీసీఎంను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ రోడ్డు ప్రమాదం మహబూబ్నగర్ జిల్లాలోని ఫరూక్నగర్ మండలం బూర్గుల సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య
నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన రెండేళ్ల కుమార్తెతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గారిపల్లిలో గల జైభారత్ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.