హైద్రాబాద్లో భారీ పేలుళ్లకు ఐసిస్ కుట్ర: మరో ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్: పాతబస్తీలో మరో ఇద్దరు ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టైన వారి పేర్లు అతావుల్లా రెహమాన్, యాసిర్. వారిని మంగళవారం నాడు నాంపల్లి కోర్టు ఎదుట హాజరుపరిచారు. హైదరాబాదులో వీరు భారీ పేలుళ్లకు కుట్ర చేసినట్లుగా గుర్తించారు.
హైదరాబాద్ విధ్వంసానికి ఐసిస్ కుట్ర: సీక్రెట్ ఇంటర్నెట్ వరల్డ్
కొద్ది రోజుల క్రితం ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరిని అరెస్టు చేసింది. గతంలో పట్టుబడ్డ ఐదుగురు నిందితులు ఇచ్చిన పక్కా సమాచారంతో వీరిని ఆధారాలతో సహా అధికారులు అరెస్టు చేశారు.
ఉగ్రవాద కార్యకలాపాల్లో వీరిది కీలకపాత్ర అని పోలీసులు గుర్తించారు. తాజాగా అరెస్టైన ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను మొఘల్ పురా, బండ్లగూడకు చెందిన అహ్మదుల్లా, యాసిర్లు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని నిర్ధారించుకున్నాకే అదుపులోకి తీసుకున్నారు.
ఐసిస్ వైపు..: కేరళలో 17 మంది గాయబ్, ఇద్దరు గర్భవతులే
కాగా, గతంలో పట్టుబడ్డ ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను కూడా పోలీసులు ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వారిని పన్నెండు రోజుల పాటు విచారించారు. కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. వారి నుంచి కీలక సమాచారం సేకరించారు. ఐసిస్ ఉగ్రవాదులు మారు పేర్లతో ఐసిసి చీఫ్తో మాట్లాడినట్లుగా గుర్తించారు.